ఏపీ సీఎం జగన్ టెండర్ల  విషయంలో సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. అయితే ఏపీ సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన మొదటి రోజే క్లియర్ కట్ గా చెప్పేశారు. గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి, ఏదైనా ప్రాజెక్టుల్లో అవకతవకలు జరిగుంటే ఎట్టి పరిస్థితిలో ఉపేక్షించేది లేదని తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. దానికనుగుణంగానే పీపీఏ లో జరిగిన ఒప్పందాలను సమీక్షించడానికి సిద్ద పడ్డారు. ఒక పక్క కేంద్రం వద్దన్నా పదే, పదే లెటర్స్ రాసిన వినలేదు. అలాగే గత ప్రభుత్వ హయాంలో జరిగిన కాంటాక్ట్ పనులు 25 శాతం కంటే తక్కువగా పూర్తయి ఉంటే నిలుపుదల చేయాలనీ ఆదేశాలు జారీ చేశారు. 


అయితే జగన్ ఇప్పటికే  పోలవరం విషయంలో కూడా జగన్ చాలా కఠిన నిర్ణయాలు తీసుకున్నాడని చెప్పాలి. పోలవరంలో పెద్ద అవినీతి జరిగిందని ప్రతి పక్షంలో ఉన్నప్పుడు కూడా జగన్ పలు సార్లు చెప్పుకొచ్చారు. అయితే జగన్ ఇప్పుడు అధికారంలో ఉన్నాడు కాబట్టి పోలవరంలో జరిగిన అవకతవకలు మీద ప్రత్యేక దృష్టి పెట్టారు. పోలవరంలో జరిగిన అవినీతి పై ఒక కమిటీని కూడా జగన్ నియమించారు. ఇప్పుడు ఆ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా పోలవరం పనులు నిలిపేయాలని జగన్ ఆదేశాలు జారీ చేశారు. పోలవరం నిర్మాణాన్ని చేపట్టిన నవయుగ కంపెనీకి ఏపీ ప్రభుత్వం టెర్మినేషన్ లెటర్ ఇచ్చినట్లు తెలిసిందే. 


నిజానికి ఈ కంపెనీ పనులు చేపట్టక ముందు టీడీపీ ఎంపీకి సంధించిన ట్రాన్స్ రాయ్ కంపెనీ నిర్మాణం చేపట్టింది. కానీ కొన్నేళ్ళకు రాష్ట్రం ఇచ్చిన బడ్జెట్ లో ప్రాజెక్టు ను పూర్తి చేయలేమని చెప్పి తప్పుకుంది. తరువాత వచ్చిన నవయుగ కంపెనీ ప్రాజెక్ట్ వ్యయం కంటే 14 శాతం తక్కువకే పూర్తి చేస్తామని చెప్పడంతో ప్రభుత్వం ఈ కంపెనీకి పోలవరం పనులను అప్పగించింది. కానీ ఇప్పుడు జగన్ ప్రభుత్వం నియమించిన కమిటీ సూచనల మేరకు ఈ కంపెనీని తప్పుకోమని ప్రభుత్వం టెర్మినేషన్ లెటర్ జారీ చేసింది. అయితే ఈ నిర్ణయం పట్ల కొంత మంది ఆందోళను వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇటువంటి ముఖ్యమైన ప్రాజెక్టుల్లో టెండర్ల ను రద్దు చేయడం వల్ల చాలా సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. నైపుణం .. డిజైన్ ల సమన్వయ లోపం తలెత్తితే పరిస్థితి ఏంటని పోలవరం అధారిటీ కూడా చెప్పుకొస్తుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: