సోషల్ మీడియా వేదికగా సాహో మూవీపై వ్యతిరేక ప్రచారాలు మొలు పెట్టింది టీడీపీ అభిమానులేనంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి. సాహోమూవీ ప్రమోషన్లో భాగంగా ఓ ప్రముఖ ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో యంగ్ రెబల్స్టార్ ప్రభాస్ మాట్లాడుతూ ఏపీ సీఎం జగన్పై అనుకూల కామెంట్లు చేశారు. ఏసీ సీఎం జగన్ యువకుడని, ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయడంలో సరికొత్త నిర్ణయాలు తీసుకుంటున్నారని చెబుతూనే తనకు రాజకీయాలు పెద్దగా తెలియవని, ఏపీ ఎంతో సుందర ప్రాంతమంటూ రెబల్స్టార్ ఆ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు.
ఈ క్రమంలో టీడీపీని అభిమానించే కొందరు సోషల్ మీడియా వేదికగా సాహో మూవీపై వ్యతిరేక ప్రచారం మొదలుపెట్టగా వారికి కౌంటర్గా ప్రభాస్ అభిమానులు సైతం సమాధానాలు ఇస్తున్నారు. దీనికంతటికి కారణం ఏపీ సీఎం జగన్ మోహన్రెడ్డికి అనుకూలంగా ప్రభాస్ మట్లాడటమే అంటూ ప్రభాస్ ఫ్యాన్స్ వ్యాఖ్యానిస్తున్నారు. అయితే, ఇప్పుడు టీడీపీ అభిమానులు చేస్తున్న ప్రచారం సాహో సినిమాపై ప్రభావం చూపుతుందా..? అన్న కోణంలో చర్చ జరుగుతోంది.ఇక ఈ తరుణంలోనే ప్రభాస్ను టార్గెట్ చేయడం వెనుక మరో కారణం లేకపోలేదంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి.
ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు ఈ మధ్య టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబుపై వివాదస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అలాగే బీజేపీలో కృష్ణం రాజు క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. ఆయన పార్టీపరంగా చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలు టీడీపీ అభిమానులకు రుచించడం లేదని, దీంతో ఇప్పుడు ప్రభాస్ను టార్గెట్ చేసినట్టుగా కనిపిస్తుందంటూ వార్తలు వినపడుతున్నాయి.