ప్రముఖ న్యాయవాది, కేంద్ర మాజీ మంత్రి రామ్‌ జెఠ్మలానీ(95) కన్నుమూశారు. గతకొద్ది కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రామ్‌ జెఠ్మలా ఇవాళ తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. సింధ్‌ ప్రావిన్సులోని సిఖర్పూర్‌లో 1923 సెప్టెంబర్ 14న జన్మించిన రామ్ జెఠ్మలానీ సుప్రీం కోర్టులో సీనియర్ న్యాయవాదిగా ఎన్నో కేసులు వాదించారు.                 


బార్ కౌన్సిల్ చైర్మన్‌గానూ అయన బాధ్యతలు నిర్వహించారు. వాజ్‌పేయి ప్రభుత్వంలో న్యాయశాఖ, పట్టణాభివృద్ధి శాఖల మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. రామ్ జెఠ్మలానీ వాదించిన 90 శాతం కేసులు విజయం సాధించాయి. అయన 1959లో కేఎం నానావతి వర్సెస్ మహారాష్ట్ర ప్రభుత్వం కేసు, 2011లో మద్రాసు హైకోర్టులో రాజీవ్ గాంధీ హంతకుల కేసు, 


కేతన్ పరేఖ్‌ల కేసు, అఫ్జల్ గురు ఉరిశిక్ష, జెస్సికా లాల్ మర్డర్ కేసులను స్టాక్ మార్కెట్ కుంభకోణంలో హర్షద్ మెహతా కేసులను అయన వాదించారు. అరుణ్ జైట్లీ, కేజ్రీవాల్ పరువు నష్టం కేసులోను కేజ్రీవాల్ తరపున అయన వాదనలు వినిపించారు. కాగా 2017 నవంబర్ లో అయన న్యాయవాది వృత్తి నుంచి తప్పుకున్నారు. 


రాజకీయాల్లోను తనదైన శైలిలో ముద్ర వేసుకున్నారు రామ్ జెఠ్మలానీ. ముంబై పార్లమెంటు స్థానం నుంచి బీజేపీ తరఫున 6వ లోక్‌సభకు ఎన్నికయ్యారు. రెండోసారి ఇక్కడ నుంచే 1980 ఎన్నికల్లో విజయం సాధించారు. వాజ్‌పేయి మంత్రివర్గంలో కేంద్ర న్యాయశాఖ, పట్టాభివృద్ధి మంత్రిగా బాధ్యతలను అయన నిర్వహించారు.


ఆతర్వాత బీజేపీతో విబేధాలు రావడంతో 2004 ఎన్నికల్లో లక్నో పార్లమెంటు స్థానం నుంచి వాజ్‌పేయి ప్రత్యర్థిగా పోటీచేశారు. మరి తిరిగి 2010లో బీజేపీలో చేరి రాజస్థాన్ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. కాగా రామ్ జెఠ్మలానీకు ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: