నెల్లూరులో నారాయణ మీద పోటీ చేసి స్వల్ప తేడాతో అనిల్ కుమార్ యాదవ్ గెలిచిన సంగతీ తెలిసిందే. అయితే ఎన్నికలప్పుడు అనిల్ కుమార్ యాదవ్ ను ఓడించడానికి నారాయణ కొన్ని కుటీల రాజకీయాలు కూడా చేశారు. అనిల్ మీద ఫేక్ వీడియోస్ క్రియేట్ చేసి మీడియాకు వదిలారు. అయితే ఎన్నికల్లో నారాయణ ఓడిపోయిన తరువాత వైసీపీలోకి రావటానికి తెగ ప్రయత్నించారు. కానీ అనిల్ కుమార్ యాదవ్ ..  నారాయణను పార్టీలోకి రాకుండా చేశాడని వార్తలు వస్తున్నాయి. దీనితో నారాయణ చేసేదేమి లేక సైలెంట్ అయిపోయారు.  నెల్లూరు నారాయణ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు తరువాత ఆ స్థాయిలో అధికారాన్ని చలాయించారు.


కానీ అధికారం ఎప్పుడు శాశ్వతం కాదు కదా ! ఇప్పుడు టీడీపీ ఓటమి నారాయణను బాగా కుంగదీసినట్టుంది. కనీసం మీడియా ముందుకు కూడా రావటం లేదు. నెల్లూరు స్థానం నుంచి పోటీ చేసి కూడా నారాయణ ఓడిపోవటంతో పరువు కూడా పోయింది. నెల్లూరులో  నారాయణ అభివృద్ధి కొద్దో గొప్ప చేసినా  .. డబ్బులు విచ్చలవిడిగా వెదజల్లినా గెల్వలేకపోయారు. మీడియా ముందుకు కూడా నారాయణ రాలేకపోతున్నారు. రాజధాని వ్యవహారంలో ప్రధాన ప్రతిపక్షం టీడీపీ ఇప్పటికే నానా హంగామా చేస్తుంది.


కానీ టీడీపీ పార్టీలో రాజధాని కమిటీ అధ్యక్షుడిగా పని చేసిన నారాయణ మాత్రం నోరు మెదపటం లేదు. రాజధాని విషయంలో బాబుతో పాటు నారాయణ కూడా దేశ విదేశాలు తిరిగారు. కీలక నేతగా వ్యవహరించారు. కానీ ఇప్పుడు రాజధాని వ్యవహారంలో ఒక పక్క టీడీపీ నేతలు .. లోకేష్ కూడా నిరసనకు దిగుతుంటే నారాయణ మాత్రం మౌన వ్రతం పాటిస్తున్నారు. అయితే నారాయణ మీద కేసులు నమోదు కాబోతున్నాయని సమాచారం వచ్చింది. దీనితో నారాయణ కూడా వైసీపీలో చేరడానికి ట్రై చేశారు. కానీ అనిల్ అడ్డుపడటంతో ఆగిపోయారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: