కాశ్మీర్ విషయాన్ని ఐక్యరాజ్య సమితిలో జరిగిన సమావేశంలో పాక్ లేవనెత్తడంతో భారత్ అభ్యంతరం వ్యక్తం చేసింది. కాశ్మీరు మా అంతర్గత వ్యవహారం. ఎవరైనా జోక్యం చేసుకుంటే సహించమని గట్టి హెచ్చరిక చేసింది. ఇప్పటికే పలు దేశాలు కాశ్మీర్ భారత్ అంతర్గత వ్యవహారమని తేల్చి చెప్పిన సంగతీ తెలిసిందే. అయితే మొన్నటి వరకు కాశ్మీర్ విషయంలో ఒక విధంగా స్పందించిన పాక్ ఇప్పుడు ఏకంగా ఐక్యరాజ్య సమితి సమావేశంలో కాశ్మీర్ భారత్ లో ఒక రాష్ట్రమని చెప్పడం ఇప్పుడు సంచలనం రేపుతోంది. ఇలా పాక్  రోజుకొక స్టేట్మెంట్ ఇస్తూ ఆ దేశపు డొల్లతనాన్ని బయట పెట్టుకుంటుంది.


అయితే పాక్ ఆక్రమిత కాశ్మీర్ మీద ఎక్కడ భారత్ కన్ను పడుతుందోనని పాక్ వ్యూహాత్మకంగా ఇటువంటి వ్యాఖ్యలు చేసిందా అని సందేహం వస్తుంది. భారత్ తో యుద్ధం చేసి ఓడించే శక్తి పాక్ కు లేదని దానికి తెలుసు. రెండు రోజుల నుంచి పాక్ ఆర్మీ చీఫ్ .. ఇమ్రాన్ ఖాన్ యుద్ధం తప్పదంటూ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తుంది. భారత్ ఎక్కడ పాక్ ఆక్రమిత కాశ్మీర్ ను ఆక్రమించుకుంటుందోనని పాక్ లో ఆ ఆందోళన క్లియర్ గా కనిపిస్తుంది.


అందుకే పైకి ఈ వ్యాఖ్యలు చేస్తుందని చెప్పాలి.  కాశ్మీర్ ఎప్పటికీ భారత్ లో అంతర్భాగం కాదని ఎప్పటికైనా తాము చేజిక్కించుకుంటామని పాక్ కలలు కనింది. కానీ మోడీ ప్రభుత్వం ఒక్క దెబ్బతో కాశ్మీర్ ను భారత్ లో కలిపేసుకుంది. దీనితో భారత్ తమ నెక్స్ట్ టార్గెట్ పాక్ ఆక్రమిత కాశ్మీర్ అని తేల్చి చెప్పింది. ఇప్పుడు ఇదే విషయం పాక్ ను ఖంగారు పెట్టిస్తుంది. ఇన్ని రోజులు కాశ్మీర్ కు స్వయం ప్రతి పత్తి ఉండటంతో పాక్ చాలా ఆటలు ఆడింది. కానీ ఇప్పుడు పీఓకే ను పాక్ కాపాడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఏ మాత్రం తేడా జరిగిన భారత్ .. పీఓకేను భారత్ లో కలిపేసుకుంటుందని పాక్ కు బాగా తెలుసు. 


మరింత సమాచారం తెలుసుకోండి: