ఏపీ సీఎం తీసుకున్న నిర్ణయానికి కేంద్రం మాటలురాక గిల గిల కొట్టుకుంటుంది. కేంద్రమే కాదు ఏకంగా అంతర్జాతీయ స్థాయిలోనే వణుకు మొదలైంది.. సీఎం జగన్ చేసిన ఈ చిన్న పనితో కేంద్రం దిమ్మ తిరిగింది. ఇంతకు సీఎం జగన్ అంతలా ఏమీ చేశారు..ఆయన చేసిన పనితో అంతలా కేంద్రం భయపడే పరిస్థితి ఎందుకొచ్చింది. అనే డౌట్ క్లీయర్ కావాలంటే అసలేం జరిగిందో ముందుగా తెలుసుకుందాం.
పదవిలో ఉన్నప్పుడు ఏపీ మాజీ సీఎం చంద్రయ్య చేసిన వ్యవహారం ఇప్పుడు కేంద్రం మెడకు చుట్టుకుంది. సీఎంగా చంద్రబాబు ఉన్నప్పుడు ఒప్పందం చేసుకున్న విద్యుత్ పీపీఏలపై సమీక్షించాలని సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ పీపీఏల సమీక్ష చేస్తే అంతర్జాతీయంగా కేంద్రానికి పెద్ద దెబ్బ పడనుందట. ఎందుకంటే అధికారం చేతులు మారగానే పీపీఏలపై సమీక్ష చేస్తే ఇది రాజకీయ కక్షలకు దారితీసి, విద్యుత్ పెట్టుబడులపైన, విద్యుత్ ఉత్పత్తి పైనా తీవ్రప్రభావం చూపన్నది. అందుకే జగన్ తీసుకున్న పీపీఏల సమీక్ష ఇప్పుడు పెద్ద ఎత్తున్న జాతీయ, అంతర్జాతీయ, స్థాయిలో దుమారన్నే రేపుతుంది. అందుకే కేంద్రం కూడా పీపీఏల సమీక్షపై జంకుతున్నదని అర్ధం. దీన్ని బట్టి చూస్తే పీపీఏల పేరుతో జరిగే దోపిడిని అరికట్టలేనంత స్థాయిలోనే జరుగుతుందని తెలుస్తుంది.
దీనికోసం అంతర్జాతీయ స్థాయిలో పెద్ద మాఫీయాగానే తయారైనట్లే అనే అనుమానం వస్తుంది.. అందుకే జగన్ చాలా తెలివిగా ప్రవర్తించిన తీరు కేంద్రానికి వణుకు పుట్టిస్తున్నదట. అంటే జగన్ తేనేతుట్టేను కదిపాడన్నమాట. ఇకపోతే బాబు అవినీతిని నిరూపించి, ప్రజలకు వాస్తవాలు తెలువాలని జగన్ చేసిన ప్రయత్నం కాస్త కేంద్రం మెడకు చుట్టుకునే పరిస్థితి వచ్చింది.
అందుకే కేంద్రం జగన్ వేసిన దెబ్బకు బెంబేలెత్తిపోయి ఇప్పుడు దేశంలోని అన్ని రాష్ట్రాలకు చెందిన పీపీఏలపై ఎలాంటి సమీక్షలు నిర్వహించకుండా చేసేందుకు కేంద్ర విద్యుత్తు శాఖ మంత్రి ఆర్కే సింగ్ నేతృత్వంలో అన్ని రాష్ట్రాల విద్యుత్తు శాఖా మంత్రుల సమావేశంను ఈ నెల 11, 12 తేదీల్లో గుజరాత్లో ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ప్రధానంగా విద్యుత్ పీపీఏలపై చర్చించనున్నారనే ఎజెండాను పంపింది కేంద్ర ప్రభుత్వం. అంటే జగన్ వేసిన ఎత్తుకు కేంద్రంలో వణుకు షురూ అయి ఇప్పుడు ఏకంగా అన్ని రాష్ట్రాల విద్యుత్ శాఖ మంత్రులతో సమావేశం ఏర్పాటు చేసే పరిస్థితి వచ్చిందన్నమాట అని రాజకీయ వర్గాల్లో చర్చించుకుంటున్నారు...