పిల్లలు ఎలా ఉంటారు.. ఎలా ఉండాలి.. ఎలా ఉంటె బాగుంటుంది అనే దానిపై ప్రతి ఒక్కరికి ఒక్కో అంచనా ఉంటుంది.  పిల్లలు ఎలాంటి విషయాల్లో ఎదగాల్లో తల్లిదండ్రులకు బాగా తెలుసు.  అందుకే వాళ్ళను ఆయా రంగాల్లో విజయం సాధించేందుకు ప్రోత్సాహం చూపిస్తుంటారు. అంతేకాదు, పిల్లలు ఎలా చదవాలో.. ఎక్కడ చదవాలో.. విషయంలో ఉద్యోగాలు సంపాదించాలో అన్నింటిలోనూ పెద్దల నిర్ణయం ఉంటుంది.  


ఇక ఇదిలా ఉంటె, అక్టోబర్ మాసం వచ్చింది అంటే.. విదేశాల్లో కొన్ని రకాల గెటప్స్ వేసుకొని హంగామా చేస్తుంటారు.  హాలోవీన్ అనే వింత పోకడలతో అక్కడ పండుగలు చేసుకుంటారు.  ఈ పండుగ విచిత్రంగా ఉంటుంది.  వివిధ రకాల గెటప్స్ లో జనాలను భయపెట్టే విధంగా ఉంటారు. ఓక్లహామాకు చెందిన ఓ మహిళా తన పిల్లలకు భయపడే విధంగా గెటప్స్ వేసింది.  


వాళ్ళను చూసిన వెంటనే అందరు భయంతో వణికిపోయారు.  బాబోయ్ ఈ పిల్లలేంటి ఇలా ఉన్నారు.. ఇలా భయపెడుతున్నారు అని భయపడ్డారు. హాలోవీన్ గెటప్స్ కోసమే ఇలా మారిపోయారని, అంతకు మించి మరేం కాదని అంటున్నారు.  ఆరేళ్ళ చిన్నారిని దెయ్యంలా అలంకరించి తలకు ఒంటికి నెత్తురు వంటి ఎర్రరంగు పులుముకొని ఉన్న గెటప్ లో ఉన్నది.  చేతిలో ఓ బొమ్మ.  ఆ బొమ్మ చూడటానికి దెయ్యం బొమ్మల ఉన్నది.  ఆ గెటప్ లో ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.  ఈ ఫోటోలు వైరల్ అయ్యాయి.  


అంతేకాదు ఆ మహిళ తన 11 నెలల బాబును కూడా ఇలాగే మార్చింది.  ఒంటిపై బట్టలు లేకుండా.. బక్కెట్లో కూర్చోపెట్టి.. ఎర్రటి నీరు పోసింది.  చేతికి మనిషి బ్రెయిన్ లాంటి ఓ బొమ్మను ఇచ్చింది.  అది కూడా ఎర్రగా భయానకంగా ఉండటంతో చూసేవాళ్ళు షాక్ అయ్యారు.  హాలోవీన్ పండుగ అంటే ఇంతదారుణంగా ఉంటుందా అని భయపడిపోతున్నారు.  ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కొందరైతే ఆ మహిళను తిట్టిపోస్తున్నారు.  మరికొందరు ఇది కేవలం ఆర్ట్ కోసమే కదా అని మెచ్చుకుంటున్నారు.  ఇలాంటి వేషాలు వేయిస్తే పెద్దయ్యాక పిల్లలు అలానే మారిపోతారని భయపడుతున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: