ఓవైపు తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె ఉధృతంగా కొనసాగుతుండగా... అటు ఏపీఎస్ ఆర్టీసీ మాత్రం ఫుల్ పండగ చేసుకుంటుంది. దసరా పండగ సీజన్ లో ఏపీఎస్ ఆర్టీసీకి లాభాల పంట పండింది. 2018తో పోలిస్తే, రూ. 20 కోట్లు అధికంగా రూ. 229 కోట్ల ఆదాయం వచ్చిందని ఆర్టీసీ అధికారులు తెలిపారు.

దసరా పండగ సందర్భంగా స్పెషల్ సర్వీసులు, రెగ్యులర్ బస్సులకు మంచి డిమాండ్ ఉండటంతో ఆక్యపెన్సీ రేషియో 103 శాతానికి చేరిందని తెలిపారు.మాములుగా నష్టాల్లో ఉండేయ్ ఆర్టీసీ కి ఇది అనుకోని వరం ల ఉంది గత నెల 27వ తేదీ నుంచి ఈ నెల 13 వరకూ మొత్తం 5,887 ప్రత్యేక సర్వీసులను నడిపించినట్లుగా ఆర్టీసీ అధికారులు తెలిపారు. మరోవైపు తెలంగాణలో దసరా సీజన్ ఆరంభంలోనే ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగడం, ఏపీఎస్ ఆర్టీసీకి కలిసొచ్చింది.

ఈ సీజన్ లో విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకునేందుకు తెలంగాణ నుంచి పెద్ద ఎత్తున భక్తులు వస్తుంటారు. వారంతా తమ ప్రయాణానికి ఆంధ్రా బస్సులనే ఆశ్రయించారు. దీంతో ఏపీకి భారీగా ఆదాయం పెరగడానికి కారణమైంది. నిత్యమూ దాదాపు 40 వేల మందిని గమ్యస్థానాలకు చేర్చే ఏపీ బస్సులు, పండగ సీజన్ లో రోజుకు 75 వేల మందిని గమ్యాలను చేర్చాయి.

ఇప్పటికీ సీఎం జగన్ గారు ఆర్టీసీ ని గవర్నమెంట్ లో విలీనం చేసి ఆర్టీసీ కి ఊహించని బహుమతిని ఇచ్చారు . మరో వైపు తెలంగాణ ఆర్టీసీ కి మాత్రం సమ్మె సెగ ఇంకా కొనసాగుతుంది తెలంగాణ ముఖ్య మంత్రి చంద్ర శేఖర్ గారు ఆర్టీసీ సిబ్బంధి ని తొలిగించిన విషయం తెలిసిందే .ఏది ఎం అయినప్పటికీ ఇది మన ఆర్టీసీ కి మంచి పరిమాణం .


మరింత సమాచారం తెలుసుకోండి: