తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఎక్క‌డ చూసినా సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి, కేంద్ర మాజీ మంత్రి, మెగాస్టార్ చిరంజీవి ల భేటీ చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఏ న‌లుగురు క‌లిసినా జ‌గ‌న్‌, చిరంజీవిల క‌ల‌యిక‌పైనే చ‌ర్చ‌లు జోరుగా సాగుతున్నాయి. అస‌లు ఈ భేటీ సంద‌ర్భంగా ఓ చ‌ర్చ మాత్రం జోరుగా వినిపిస్తుంది. ఇప్పుడు జ‌గ‌న్‌, చిరంజీవి ల క‌ల‌యిక‌లో ఆయ‌న మెగాస్టార్ త‌న‌యుడు రామ్ చ‌ర‌ణ్ ఎందుకు రాలేదా.. అనేది ఇక్క‌డ హాట్ టాపిక్‌గా మారింది. ముందుగా సీఎం జ‌గ‌న్‌తో మెగాస్టార్ చిరంజీవి, ఆయ‌న త‌న‌యుడు రామ్‌చ‌ర‌ణ్, సైరా సినిమా ద‌ర్శ‌కుడు సురేంద‌ర్‌రెడ్డి భేటీ ఉంటుంద‌ని అనుకున్నారు.


అందుకు త‌గిన విధంగానే ఏర్పాట్లు కూడా చేశార‌ట సీఎం నివాసంలో. అయితే చివ‌రి నిమిషంలో రామ్‌చ‌ర‌ణ్ ఈ భేటికి రాలేదు. దీంతో ఎక్క‌డ చూసినా ఒక్క‌టే చ‌ర్చ‌. రామ్ చ‌ర‌ణ్ ఎందుకు రాలేదు.. అస‌లు రాక‌పోవ‌డానికి గ‌ల కార‌ణాలు ఏంటీ అనేది తెలియ అంద‌రు బుర్ర గోక్కుంటున్నారు. అయితే రామ్ చ‌ర‌ణ్ రాక‌పోవ‌డానికి ఓ ప్ర‌త్యేక కారణం ఉంద‌ట‌.. ఆ కార‌ణం వింటే మీరు కూడా షాక్ కావాల్సిందే..


ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్‌తో మెగాస్టార్ చిరంజీవి భేటి ఈనెల 11న జ‌ర‌గాల్సి ఉంది.ఆ రోజు భేటీ అయితే మెగా త‌న‌యుడు రామ్ చ‌ర‌ణ్, సైరా సినిమా ద‌ర్శ‌కుడు సురేంద‌ర్‌రెడ్డి వ‌చ్చేవార‌ట‌. ఈ భేటీలో చిరంజీవి స‌తిమ‌ణీ సురేఖ పాల్గొనేది కాద‌ట‌.  అయితే అనివార్య కార‌ణాల‌తో ఈ భేటి ఈనెల 14కు వాయిదా ప‌డ‌టం, సీఎం జ‌గ‌న్ కాస్త ఈభేటీకి ప్ర‌త్యేక విందు ఏర్పాటు చేయ‌డం జ‌రిగింది. అయితే రామ్ చ‌ర‌ణ్‌, సురేంద‌ర్‌రెడ్డిలు రాక‌పోవ‌డానికి ప్ర‌త్యేక కార‌ణం రాజ‌కీయ కార‌ణాలేన‌ట‌. మెగాస్టార్, జ‌గ‌న్‌ల భేటీ సంద‌ర్భంగా కేవ‌లం సైరా చిత్రం చ‌ర్చ‌లే కాకుండా ప్ర‌స్తుత రాజ‌కీయ ప‌రిణామాల‌ను ఏకాంతంగా మాట్లాడే అవ‌కాశం ఉన్న‌ద‌ట‌.


దీనికి తోడు రామ్ చ‌ర‌ణ్‌కు ఆర్ ఆర్ ఆర్ మూవీ షూటింగ్‌కు వెళ్ళాడ‌ట‌. ఇక ద‌ర్శ‌కుడు సురేంద‌ర్‌రెడ్డి కూడా త‌న ప్రాజెక్టుల‌తో బిజిగా కావ‌డంతో ఈ భేటికా రాలేద‌ట‌. అయితే మెగాస్టార్ చిరంజీవి దంప‌తులు, జ‌గ‌న్ దంప‌తుల‌ను క‌లిసి కుటుంబ ముచ్చ‌ట్ల‌తో పాటుగా రాజ‌కీయ ముచ్చ‌ట్లు చ‌ర్చ‌కు వ‌చ్చాయ‌ట‌. చిరంజీవి, జ‌గ‌న్ క‌లిస్తే వ‌చ్చేవీ రాజ‌కీయాలే కావ‌డంతో రామ్ చ‌ర‌ణ్ ఈ భేటీకి దూరంగా ఉన్నార‌ట‌.


మరింత సమాచారం తెలుసుకోండి: