దీపావళీ వరకు పసిడి ధర ఏమాత్రం ఉంటుందో తెలియదు గాని ప్రస్తుతం ఇప్పుడు మాత్రం క్రమక్రమంగా దిగుతూ, బంగారం ప్రియుల మనసులో ఆశలు రేపుతుంది. అందులో భాగంగానే బంగారం ధర పడిపోతూనే వస్తోంది. ఇకపోతే దేశీ మార్కెట్‌లో పసిడి మూడో రోజు కూడా తగ్గింది. ఎంసీఎక్స్ మార్కెట్‌లో సోమవారం గోల్డ్ ఫ్యూచర్స్ కాంట్రాక్స్ ధర 0.14 శాతం క్షీణతతో 10 గ్రాములకు రూ.37,795కు దిగొచ్చింది. మూడు రోజుల్లో బంగారం ధర మొత్తంగా రూ.600 పడిపోయింది. ఒక దశలో బంగారం ధర 10 గ్రాములకు రూ.40,000 సమీంలోకి చేరింది. దీంతో పోలిస్తే ఇప్పుడు పసిడి ధర ఏకంగా రూ.2,200 దిగొచ్చింది. వెండి ధర మాత్రం పెరిగింది.


ఎంసీఎక్స్ మార్కెట్‌లో కేజీ వెండి ధర 0.19 శాతం పెరుగుదలతో రూ.45,258 స్థాయికి చేరింది. గత రెండు సెషన్లలో వెండి ధర కూడా మొత్తంగా రూ.800 పడిపోయింది. ప్రస్తుతం గ్లోబల్ మార్కెట్‌లో పసిడి నేలచూపు చూస్తోంది. అదీగాక అమెరికా, చైనా మధ్య పాక్షిక వాణిజ్య ఒప్పందం కారణంగా బంగారం ధరపై ప్రతికూల ప్రభావం పడింది. బంగారం ధర ఔన్స్‌కు 0.3 శాతం క్షీణతతో 1,485 డాలర్లకు తగ్గింది. అమెరికా కూడా చైనాపై టారిఫ్ పెంపు ఉండదని పేర్కొంది.


ప్రస్తుతం గోల్డ్ ట్రేడర్లు ఫెడరల్ రిజర్వు నిర్ణయం కోసం వేచిచూస్తున్నారు. ఈ నెల చివరిలో ఫెడ్ రేట్ల నిర్ణయం వెలువడనుంది. అలాగే ట్రేడర్లు బ్రెగ్జిట్ అంశాన్ని కూడా నిశితంగా గమనిస్తున్నారు. ఈ దశలో బ్రిటన్, యూరోపియన్ యూనియన్‌కు రానున్న రోజులు చాలా కీలకంగా మారనున్నాయని తెలుస్తుంది. ఇంతేగాక దేశీ బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. దీంతో పండుగ సీజన్ నేపథ్యంలో బంగారం కొనుగోళ్లు పెరగొచ్చనే అంచనాలున్నాయి. అయితే బంగారం ధర ఇంకా గరిష్ట స్థాయిల్లోనే కదలాడుతోంది.. అయితే ప్రస్తుత పరిస్దితిలో పసిడి కనుగోలుదారులు ఎటువైపు ఎక్కువగా మొగ్గుచూపుతారో తెలియాలంటే కాస్త ఆగాలంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: