రోజు అలుపు లేకుండా కష్టపడుతున్నాం కాని పైసా పొదుపు అవ్వడం లేదని బాధపడే వారిని మనం తరచుగా చూస్తుంటాం. మరి కొందరి దగ్గర ఎంత జీతం లేపిన అసలు మిగులు కొంతైన ఉండదు. ఇలాంటి వారు డబ్బులను చిన్న మొత్తంగా పొదుపు చేసుకుంటే బాగుండునని అనుకుంటారు. అవును ఇదే మధ్యతరగతి వారికి సరైన పద్దతి. ఎందుకంటే ఒకేసారి పెద్దమొత్తంలో డబ్బు పొదుపు చేయాలంటే ఇలాంటి వారి వల్ల కాదు కాబట్టి చిన్నపొదుపు పెద్దమొత్తానికి పునాదిలా పనిచేస్తుంది. ఇలా ఆలోచించే వారికి బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లు, పోస్టాఫీస్ స్కీమ్స్ వంటివి పాపులర్ ఇన్వెస్ట్‌మెంట్ సాధనాలుగా కొనసాగుతున్నాయి.


అలాగే మ్యూచువల్ ఫండ్స్‌ ఇన్వెస్ట్‌మెంట్లకు కూడా ఆదరణ పెరుగుతూ వస్తోంది, కాబట్టి ఇన్వెస్టర్లు దీర్ఘకాల ఇన్వెస్ట్‌మెంట్ల ప్రాధాన్యాన్ని గుర్తించడం ఇందుకు కారణం. దీర్ఘకాలంలో కాంపౌండింగ్ ప్రయోజనం వల్ల అధిక రాబడిని పొందొచ్చు. దీనిపై ఎల్‌జే బిజినెస్ స్కూల్ మ్యూచువల్ ఫండ్ నిపుణుడు పూనమ్ రుంగ్టా మాట్లాడుతూ.. ‘మ్యూచువల్ ఫండ్స్‌లో నెలకు రూ.1,000 చొప్పున పదేళ్లపాటు ఇన్వెస్ట్ చేశారనుకోండి. అప్పుడు మీ ఇన్వెస్ట్‌మెంట్ మొత్తం రూ.1,20,000 అవుతుంది. దీనిపై మీకు రూ.1,82,946 రాబడి పొందొచ్చు. ఇలా మీరు మరో పదేళ్ల ఇన్వెస్ట్‌మెంట్లను కొనసాగిస్తే.. అప్పుడు మీకు మెచ్యూరిటీ సమయంలో రూ.3.94 లక్షలు లభిస్తాయి. ఈ విషయాన్ని 8 శాతంగా వార్షిక రాబడిని పరిగణలోకి తీసుకుని వివరించారు.


ఇలా క్రమం తప్పకుండా ఇన్వెస్ట్ చేయడం వల్ల పెట్టుబడి పెరుగుతూ వస్తుందని ఆయన తెలిపారు. అలాగే ఇన్వెస్ట్‌మెంట్ మొత్తంపై వచ్చిన రాబడి కూడా మళ్లీ ఇన్వెస్ట్‌మెంట్‌ మొత్తానికి కలుస్తుంది. దీంతో ఇన్వెస్ట్‌ చేసిన మొత్తం పెరుగుతుంది. దీనిపై మళ్లీ రాబడి లభిస్తుంది’ అని పేర్కొన్నారు.. ఇకపోతే మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం వల్ల కాంపౌండింగ్ ప్రయోజనం కారణంగా పదేళ్లకు పైన దీర్ఘకాలంలో రెండంకెల రాబడిని అందుకోవచ్చని, మ్యూచువల్ ఫండ్ సిప్ మార్గంలో కనీసం 12 శాతం రాబడి లభిస్తుందని ట్రాన్సెండ్ కన్సల్టెంట్స్ వెల్త్ మేనేజ్‌మెంట్ మేనేజర్ కార్తీక్ ఝవేరి తెలిపారు. ఇవండి చిన్నమొత్తాల పొదుపు సీక్రేట్స్..


మరింత సమాచారం తెలుసుకోండి: