వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ట్విట్ స్టార్ విజయసాయి రెడ్డి ట్విట్టర్ లో ట్విట్ చేస్తూ చంద్రబాబుని అతని అనుచరులపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ట్విట్టర్ లో ప్రతి రోజు ఏదొక విషయంపై ప్రతిపక్షాలపై విరుచుకుపడే విజయసాయి రెడ్డి ఈరోజు ఉదయం నందమూరి బాలకృష్ణ రెండొవ అల్లుడి శ్రీభరత్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుది దొంగల ముఠా అని విజయసాయి రెడ్డి వ్యాఖ్యానించారు. 


వివరాల్లోకి వెళ్తే.. నందమూరి బాలకృష్ణ చిన్న అల్లుడు గురించి అందరికి తెలిసే ఉంటుంది. గత నెలలలో ఓ ప్రముఖ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చి ఎన్టీఆర్ అవసరం టీడీపీకి లేదని సంచలన వ్యాఖ్యలు చేసి ట్రెండ్ అయినా సంగతి తెలిసిందే. అయితే ఈ శ్రీ భరత్ 2019 ఎన్నికల్లో విశాఖ టిడిపి అభ్యర్థిగా పోటీ చేశాడు. దీంతో ఎన్నికల్లో ఘోరాతి ఘోరంగా ఓడిపోయాడు. అయితే ఈ శ్రీభరత్ కుటుంబం రూ.13 కోట్లు పైచిలుకు బకాయి పడ్డట్టు ఆంధ్రా బ్యాంక్ పేపర్లలో ఆస్తుల వేలం ప్రకటన వచ్చింది. 


దీంతో ఈ విషయంపై విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా స్పందించాడు. విజయసాయి రెడ్డి ట్విట్ చేస్తూ 'నందమూరి బాలక్రిష్ణ చిన్నల్లుడు, విశాఖ టిడిపి అభ్యర్థిగా పోటీ చేసిన శ్రీభరత్ కుటుంబం రూ.13 కోట్లు పైచిలుకు బకాయి పడ్డట్టు ఆంధ్రా బ్యాంక్ పేపర్లలో ఆస్తుల వేలం ప్రకటన ఇచ్చింది. చంద్రబాబు దొంగల ముఠా, ఆయన బీజేపీలోకి పంపిన వాళ్లు అంతా కలిసి లక్ష కోట్ల మేరకు బ్యాంకులను ముంచారు.'' అంటూ ట్విట్ పెట్టారు విజయ్ సాయి రెడ్డి. దీంతో ప్రస్తుతం ఈ ట్విట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి: