జగన్ సంచలన నిర్ణయం. ఇది నిరుద్యోగులకు వరం.  ప్రతి నిరుద్యోగి ఆనందించే విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్సీ) నిర్వహించే పరీక్షల్లో ఇంటర్వ్యూ విధానాన్ని రద్దుచేయాలని నిర్ణయించారు..రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఈ కొత్త విధానం వచ్చే ఏడాది జనవరి నుంచి  అమల్లోకి రావాలని ఆదేశించారు.


ఇకపోతే రాత పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ ఆధారంగా అత్యంత పారదర్శకంగా ఉద్యోగాలను భర్తీ చేయాలని ఆదేశించారు. ఏపీపీఎస్సీ ద్వారా ఉద్యోగాల భర్తీ తదితర అంశాలపై ముఖ్యమంత్రి జగన్‌ గురువారం క్యాంపు కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఉద్యోగాల భర్తీలో ఇంటర్వ్యూల విధానాన్ని రద్దుచేయాలనే నిర్ణయంతో, ఇక మీదట ఏపీపీఎస్సీ నియామకాల్లో ఇంటర్వ్యూలు ఉండవు అని స్పష్టం చేశారు.


అంతేగాకుండా, నియామకాల కోసం నిర్వహించే పరీక్షల్లో ఎలాంటి పొరపాట్లు జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, పూర్తి పారదర్శకత ఉండేలా వ్యవహరించాలని స్పష్టం చేశారు. ప్రతి జనవరిలో ఉద్యోగాల భర్తీపై క్యాలెండర్‌ విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలని కూడా జగన్ ఆదేశాలు జారీ చేసినట్టు చెబుతున్నారు. ఏపీపీఎస్సీ నిర్వహించే ప్రతి పరీక్షలో ఐఐటీ, ఐఐఎం భాగస్వామ్యం తీసుకునేలా ప్లాన్ చేయాలని కూడా జగన్ ఆదేశించారు.


ఈ సందర్భంగా ఏపీపీఎస్సీ  నిర్వహించే ప్రతి నోటిఫికేషన్‌ కోర్టు కేసులకు దారితీస్తుందని అధికారులు జగన్ దృష్టికి తీసుకెళ్లగా ఇకమీదట ఆ తప్పు జరక్కుండా చూసుకోవాలని పేర్కొన్నట్టు చెబుతున్నారు.  అవినీతి, ఆశ్రిత పక్షపాతం లేకుండా పరీక్షలు నిర్వహించాలని నిర్దేశించారు. పరీక్షల నిర్వహణ, పోస్టుల భర్తీలో అత్యుత్తమ పారదర్శక విధానాలకు పెద్దపీట వేయాలని ఆదేశించారు.


ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేసే ఉద్యోగాలకు సంబంధించి అత్యవసర సర్వీసులు అందించే విభాగాల్లో పోస్టుల భర్తీలో ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించారు.  ఇకపోతే ఏపిలో జరిగే ఉద్యోగాల భర్తీలో రాత పరీక్షలో చూపించే ప్రతిభే కొలమానం కానుందని. దీనివల్ల మెరిట్ సాధించిన విద్యార్ధులకు ఎంతో మేలు చేకూరనుందని  తెలుస్తుంది..


మరింత సమాచారం తెలుసుకోండి: