హైదరాబాద్ లోని ఎల్‌బీ నగర్‌లోని షైన్ చిన్నారుల ఆస్పత్రిలో ఘోర అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఐసీయూలో షార్ట్ సర్క్యూట్‌ కారణంగా ఆసుపత్రిలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో ఈ ప్రమాదంలో సూర్యాపేటకు చెందిన ఐదు నెలల చిన్నారి మరణించిగా, ఆరుగురు చిన్నారులకు తీవ్రంగా గాయలయ్యాయి.                   

                                          

ఎల్‌బీ నగర్ పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న షైన్ ఆస్పత్రిలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో గాయపడిన చిన్నారులను సమీపంలోని లోటస్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా ఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది అద్దాలను పగలగొట్టి మంటలను అదుపు చేశారు.             

                            

కాగా ఈ ప్రమాదం జరిగిన సమయంలో ఆసుపత్రిలో మొత్తం 42 మంది చిన్నారులు ఉన్నారు. అయితే ఈ ప్రమాదానికి ఆసుపత్రి యాజమాన్యం నిర్లక్షమే కారణం అని బంధువులు తల్లిదండ్రులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. కాగా ఇలాంటి ఘటనలు అన్ని ఇటీవలే కాలంలో ఎక్కువగా జరుగుతున్నాయి. మొన్నటికి మొన్న ఢిల్లీలో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది.     

                                                         


మరింత సమాచారం తెలుసుకోండి: