ఈ మధ్య ప్రేమ జంటలు బాగా రెచ్చిపోతున్నారు. ఎక్కడ పడితే అక్కడ  విచ్చలవిడిగా రొమాన్స్  చేసేస్తున్నారు. కాస్త జనాలు కనిపించకపోతే చాలు ఇక విచ్చలవిడి రొమాన్స్ తో రచ్చ  చేస్తున్నారు. ఇలాంటివి ఎక్కువగా పార్కులోనే  కాదు ఎక్కడపడితే అక్కడ కనీసం అది పబ్లిక్ ప్లేస్ అని కూడా గమనించకుండా వాళ్ళ పని వాళ్ళు కానిచ్చేస్తున్నారు. ఇక వీళ్ళు చేసే రచ్చ మామూలు కాదండోయ్... నాలుగు గోడల మధ్య  చేయాల్సిన పని... అందరి ముందు కానిచ్చేస్తున్నారు. ఇప్పటికే ఇలాంటి జంటలు ఎన్నో  వార్తల్లోకెక్కాయి . ఇక ఇప్పుడు ఓ జంట ఏకంగా రైల్లో దుకాణం  పెట్టేసారు. ఇక ఆ తర్వాత చిక్కుల్లో పడ్డారు ఈ జంట.



 ఈ ఘటన  స్కాట్ ల్యాండ్ లోని గ్లాస్లో నుండి ఎడిన్బర్గ్ కు వెళ్లే ట్రైన్ లో చోటుచేసుకుంది. మద్యం మత్తులో ఉన్న ఓ జంట ఖాళీగా ఉన్న బోగీలోకి ప్రవేశించారు. కాగా  ఆ బోగీలో ఎవరూ లేకపోవడంతో సభ్యత మరిచి ప్రవర్తించారు ఈ జంట. ఇక ఎవరూ చూడడం లేదని వాళ్ళ పని మొదలు పెట్టేసారు. శృంగారంలో మునిగితేలుతున్నారు. కానీ వీళ్ల గుట్టను  అక్కడే రైల్లో ఉన్న సీసీ టీవీ రట్టు చేసింది. ఈ జంట చేసిన రచ్చ  మొత్తం సిసిటివి ఫుటేజ్ లో రికార్డ్ కావడంతో... ఈ వీడియోను అక్కడి రైల్వే అధికారులు కంటపడింది. కాగా  అధికారుల్లో  ఎవరో  ఈ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్  చేశారు. 



 దీంతో సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ గా మారిపోయింది. అయితే ఈ వీడియో వైరల్ గా మారి తిరిగి  తిరిగి అధికారుల దగ్గరకు చేరుకుంది. దీంతో ఈ ఘటనపై అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేసి  చర్యలు తీసుకోవాలని కోరారు. కాగా ఈ వీడియో ని ఆన్ లైన్లో లీక్ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. కాగా  పాశ్చాత్య దేశాల్లో  ఇలాంటి ఘటనలు ఎక్కువగా జరుగుతుండడంతో... ఇలాంటి సంఘటనలు పోలీసులకు పెద్ద తలనొప్పిగా మారాయి. అంతేకాకుండా కాస్త జనాలు  కనిపించకపోతే చాలు... సభ్య సమాజం తలదించుకునే విధంగా ప్రవర్తిస్తూ జనాలు రెచ్చిపోతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: