ఐరాస సభ్యదేశాల్లో పాక్ కు మద్దతు ఇస్తున్న దేశాల్లో
మలేషియా ఒకటి. ఐరాస సర్వసభ్య దేశాల సమావేశంలో కాశ్మీర్ విషయంలో ఇండియాకు వ్యతిరేకంగా మాట్లాడిన మలేషియాపై
ఇండియా ఫైర్ అయ్యింది. పాక్ కు సపోర్ట్ చేస్తూ ఆ దేశాన్ని వెనకేసుకుంటూ వచ్చింది. దీంతో
ఇండియా ఆ దేశంతో వాణిజ్య విషయంలో ఆలోచనలో పడింది. ఆ దేశం నుంచి
ఇండియా ఎక్కడా మొత్తంలో పామాయిల్ ను దిగుమతి చేసుకుంటుంది.
మలేషియా నుంచి సంవత్సరానికి 2 బిలియన్ డాలర్ల
బిజినెస్ జరుగుతుంది.
ఈ ట్రేడ్
బిజినెస్ కు
ఇండియా చెక్ పెట్టింది.
మలేషియా నుంచి దిగుమతి చేసుకునే పామాయిల్ పై నిషేదిరం విధించింది. ఇకపై ఆ దేశం నుంచి పామాయిల్ ను దిగుమతి చేసుకోకూడదు అని నిర్ణయం తీసుకుంది.
ఇండియా తీసుకున్న నిర్ణయాన్ని ఇండియన్ వర్తక సంఘాలు కూడా సమర్ధించాయి. దీంతో
ఇండియా ఆ దేశం నుంచి పామాయిల్ ను దిగుమతి చేసుకోవడం పక్కన పెట్టింది.
మలేషియా నుంచి దిగుమతి ఆపేసి..
ఇండోనేషియా నుంచి దిగుమతి చేసుకోవాలని చూస్తున్నది. అయితే,
మలేషియా మాత్రం ఈ విషయంలో వెనకడుగు వేసేది లేదని అంటోంది. దిగుమతి చేసుకోవడమా ఆపేసినా.. దానివలన నష్టం వచ్చినా సరే.. కాశ్మీర్ విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తి లేదని తేల్చి చెప్పింది.
జమ్మూ కాశ్మీర్ పై తన వ్యాఖ్యల్ని ఉపసంహరించుకోనని స్పష్టంచేశారు. అలాగే, ఈ సమయంలో పామాయిల్ అంశాన్ని అంతర్జాతీయ వాణిజ్య సంస్థ వద్దకు కూడా తీసుకురాబోమన్నారు. భారత వ్యాపారులు తీసుకున్న నిర్ణయం చాలా పెద్దదనీ.. మలేషియన్ పామాయిల్ ఉత్పత్తిదారులపై ఇది ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని ఆ దేశ వాణిజ్య నిపుణులు పేర్కొంటున్నారు. ఈ ఏడాది జనవరి - సెప్టెంబర్ మాసాల మధ్య మధ్య
మలేషియా నుంచి భారత్ 3.9 మిలియన్ టన్నుల మేర పామాయిల్ను కొనుగోలు చేసింది.