ఏపీ లో ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే సినీనటి రోజా ముఖ్యమంత్రి చంద్రబాబుపై మరోసారి ఫైర్ అయ్యారు.  చంద్రబాబు నాయుడి పాలనలో అక్రమాలకు అడ్డాగా మారిందని.. జులుం చేస్తున్న నేతలు గద్దెనెక్కి పాలిస్తున్నారని ఆమె విమర్శించారు. ఆయన ప్రెస్ మీట్ పెట్టి కల్లబొల్లి కబుర్లు చెబుతున్నారు..పచ్చి అబద్దాల మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాటలు వింటూంటే ప్రజలు భయపడిపోతున్నారని వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్యే ఆర్.కె.రోజా ధ్వజమెత్తారు.

విలేకరులతో ఆమె మాట్లాడుతూ వచ్చేఏడాది కల్లా రాష్ట్రంలో 15% వృద్ధిరేటు(జీడీపీ) సాధించాలని సాధ్యం కాని మాటలు మాట్లాడుతున్నారు.   ప్రపంచంలోనే అత్యధిక జీడీపీ వృద్ధిరేటు ఉండే చైనాలోనే 7.40%, భారత్‌లో 7% ఉంటే ఏపీలో మాత్రం 15% లక్ష్యంగా పెట్టుకున్నామని చంద్రబాబు అనడం చాలా విడ్డూరంగా ఉందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ఒక వైపు లోటు బడ్జెట్ ఉందని..ఇక్కడ రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. విద్యార్థులు భవిష్యత్ అగమ్య గోచరంగా తయారైంది. ఇక మహిళలకైతే ఏమాత్రం భద్రత లేకుండా పోయింది.. ఆ మద్య వనజాక్షి విషయంలో  చింతమనేని ప్రభాకర్ వంటి వారిని ఎమ్మెల్యేలుగా గెలిపించుకోవడంలో రికార్డులను నమోదు చేసుకున్నారని రోజా నిప్పులు చెరిగారు.

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు


ఆంధ్రప్రదేశ్ లో ర్యాగింగ్ పడగ విప్పిందని కఠిన చర్యలు తీసుకుంటామంటున్నా మళ్లీ నాగార్జున యునివర్సిటీలో ర్యాగింగ్ రగడ కావడం ప్రభుత్వం చేతగాని పనితీరు బయట పెట్టిందని ఆమె అన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కూడా ఇంతటి వృద్ధి నమోదు కాలేదని గుర్తు చేశారు. ఆయన్ను జైలుకు లేదా పిచ్చాసుపత్రికి పంపాల్సి వుందని, ఎక్కడికి పంపాలో ఆయనకే చాయిస్ ఇస్తున్నామన్నారు.  



మరింత సమాచారం తెలుసుకోండి: