‘రాయల తెలంగాణ’ రాష్ట్ర ఏర్పాటు ప్రతిపాదనకు తాను ఇప్పటికీ కట్టుబడి ఉన్ననని మాజీ మంత్రి జె.ఎ.దివాకర్ రెడ్డి అన్నారు. రాయల తెలంగాణ గురించి తాను చెప్పిన విషయాలను వెనక్కు తీసుకోవాల్సిన అవసరం లేదని, చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకునే ప్రసక్తే లేదని, ఆయన స్పష్టం చేశారు. రాయలసీమలోని కొన్ని జిల్లాలను తెలంగాణ ప్రాంతంలో కలిపి రాయల తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని గతంలో దివాకర్ రెడ్డి ప్రతిపాదించారు. సీఏల్పీ కార్యాలయం వద్ద బుధవారం తనను కలిసిన మీడియా ప్రతినిధులతో ఆయన మాట్లాడారు. రాయల తెలంగాణ గురించి మాట్లాడిన మంత్రి టి.జి.వెంకటేశ్ తన నిర్ణయాన్ని మార్చుకుంటారేమో కానీ తాను మాత్రం తన నిర్ణయాన్ని మార్చుకోవబోనని ఆయన తెలియజేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: