మనిషి ముందు పుట్టి అనుమానం వెనుక పుట్టిందని ఓ సామెత ఉంది..తన ప్రియురాలిపై అనుమానంతో పది మందికి రక్షణ కల్పించాల్సిన పోలీస్ తనే విచక్షణ కోల్పోయి మహిళపై కాల్పులు జరిపాడు..తర్వాత తనూ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన ఢిల్లీలోని ద్వారకా సెక్టార్ 4  లో చోటు చేసుకుంది. సదరు ఎస్సై పట్టపగలు అందరూ చూస్తుండగానే తన సర్వీస్‌ రివాల్వర్‌తో మహిళను కాల్చి చంపి, అదే తుపాకితో తాను కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపుతోంది.

రన్హౌలా పోలీసు స్టేషన్లో ఎస్సైగా పని చేస్తున్న విజేంద్ర కుమార్‌ గతంలో వివాహం జరిగింది. ఆయనపై  భార్య గత కొంత కాలంగా అనుమానంతో వేధించగా ఆమె గృహహింస కేసు పెట్టింది..దీంతో కొంత కాలంగా ఇద్దరూ దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో అతనికి ఓ మహిళా విలేకరితో సన్నిహిత సంబంధం ఏర్పడింది. అయితే ఎప్పటి నుంచో ఆమెను ద్వితీయ వివాహం చేసుకోవాల్సిందిగా బలవంత పెట్టే వాడని సమాచారం. ఈ విషయం గురించి మాట్లాడేందుకు ఉద్యానవనానికి రావల్సిందిగా విజేంద్ర పిలవడంతో ఆమె అక్కడకు వచ్చారు.

ఉన్మాది ఎస్సై  విజేంద్ర ను ఆసుపత్రికి తరలిస్తున్న దృశ్యం


పార్క్ లో మాట్లాడుతూనే ఇద్దరి మద్య విభేదాలు రావడంతో అందరూ చూస్తుండగానే ఆ మహిళపై విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు..తర్వాత తనూ కాల్చుకున్నాడు. అపస్మారక స్థితిలో ఉన్న విజేందర్‌ను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉంది. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: