వివాదాస్పద న్యాయమూర్తి కర్నన్ వ్యవహారం దేశ న్యాయ చరిత్రలో కొత్త సంక్షోభానికి దారితీసేలా కనిపిస్తోంది..తాజాగా మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తిపై దేశ అత్యున్నత న్యాయ స్థానం సంచలన తీర్పును వెలువడించింది. జస్టిస్ సీఎస్ కర్నాన్ కు ఎటువంటి కేసులు ఇవ్వద్దని చీఫ్ జస్టిస్ టీఎస్ ఠాకూర్ అధ్యక్షతన ఏర్పాటైన న్యాయమూర్తుల కమిటీ ఈ ఆదేశాలు జారీ చేసింది. స్వయంగా జస్టిస్ కర్నన్ ఈ స్టే విధించడం గమనార్హం.

తాను సుప్రీంకోర్టు ఆదేశాలను వ్యతిరేకించడం లేదని, అయితే, వారి అభిప్రాయాన్ని లిఖితపూర్వకంగా కోరుతున్నానని ఈ సందర్భంగా జస్టిస్ కర్నన్ వ్యాఖ్యానించారు. దీనిపై మద్రాస్ హైకోర్టు సుప్రీంకు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఈ కేసును విచారించిన సుప్రీం దర్మాసనం జస్టిస్ సీఎస్ కర్నాన్ కు కేసులు ఇవ్వొద్దని ఆదేశాలు జారీ చేసింది ఈ విషయంలో లిఖితపూర్వక అభిప్రాయాన్ని ఏప్రిల్ 29లోగా పంపాలని సూచించిన ఆయన, అప్పటివరకూ సుప్రీం ఆదేశాలపై స్టే అమలవుతుందన్నారు.

తన పరిధిలోని అంశాలపై కల్పించుకోరాదని కూడా సీజేకు ఆయన సలహా ఇచ్చారు. కాగా, ఈ మధ్యాహ్నం కోర్టు హాల్ లో మీడియాతో మాట్లాడేందుకు కర్నన్ ప్రయత్నించగా, కోర్టు పరిపాలనా విభాగం అందుకు అనుమతించలేదు. 


మరింత సమాచారం తెలుసుకోండి: