అయితే కొత్తగా ప్రభుత్వం చేపట్టిన పథకాలకు నిధుల లేమి కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. రోడ్ల సమగ్రాభివృధ్ధికి 26 వేల కోట్లు, హస్సేన్ సాగర్ ప్రక్షాళనకు 500 కోట్లు, మూసీనది సుందరీకరణకు 3 వేలకోట్లు, మూసీ నది ఒడ్డు మీదుగా సిక్స్ లైన్ రోడ్ల నిర్మాణానికి 6,500 కోట్లు అవసరమ వుతాయని సర్కార్ అంచనా వేసింది. ఒక వైపు ఆదాయాన్ని పెంచుకోవడానికి ఉన్న అవకాశాలను ఉపయోగించుకంటూనే మరో వైపు వివిధ ఆర్థిక సంస్థల నుంచి అప్పులు తీసుకోవాలని సర్కార్ భావిస్తోంది. రోడ్ డెవలప్ మెంట్ ప్రోగ్రాంకు బ్రిక్స్ బ్యాంకు ద్వారా హుస్సేన్ సాగర్ ప్రక్షాళన కు ఆస్ట్రియా నుంచి మూసీ క్లీనింగ్ మరియు బ్యూటిఫికేషన్ కోసం గ్రీన్ క్లైమేట్ ఫండ్ ద్వారా డబ్బు అప్పుతీసుకు నేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇకపోతే... వాటర్ బోర్డు, హెచ్ఎండీఏ సంస్థలు చేసిన అప్పులకు వడ్డీలు
కట్టలేని దుస్థితి లో ఉన్నాయి. స్వావలంబనతో ఉన్న జీహెచ్ఎంసీ ఇప్పటికే
పలు ఆర్థిక భారాలు మోస్తోంది. ఆర్టీసీ,వాటర్ బోర్డుకు చెల్లిస్తున్న
నిధులే గాక... తాజాగా హైదరాబాద్ మెట్రోరైల్ భూసేకరణ భారం కూడా
జీహెచ్ఎంసీ పై మోపేందుకు ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. మరోవైపు సిటీలో
నిర్మించతలపెట్టిన లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణాలకు 17 వేల
కోట్లు అవసరం కానున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ లో పలు భారీ ప్రాజెక్టులను
తలకెత్తుకున్న నేపథ్యంలో కేసీఆర్ సర్కార్ నిధుల అన్వేషణ లో పడింది.
గులాబీ దళం ఆశల పథకాలు నెరవేరుతాయో లేదో వేచి చూడాలి.