తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత హైదరాబాద్ విశ్వనగరంగా తీర్చి దిద్దుతామని టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో అభివృద్ది కార్యక్రమాలు చేపడుతుంది. మరో పక్క ఇక్కడ నేర ప్రపంచం రోజు రోజు కీ పడగ విప్పుతుంది. అమ్మాయిల వేదింపులు, చైన్ స్నాచింగ్ లు , పబ్ కల్చర్, రేవ్ పార్టీలు, గన్ కల్చర్ లాంటివి పెరిగిపోతూనే ఉంది. కొంత మంది బడాబాబులు ఈజీ మనీ కోసం యువతను తప్పుడు బాటలో పయణించేలా చేస్తున్నారు. డ్రగ్స్, మద్యానికి బానిసలుగా చేసి వారి జీవితాలతో ఆడుకుంటున్నారు.

గతంలో రోడ్లపై యువకులు మత్తుగా తాగి చిందెయటం చూశాం..కానీ ఇప్పుడు యువతులు కూడా మద్యం సేవింది నానా హంగామాలు చేయడం సోషల్ మీడియాలో హల్ చల్ చేయడం చూస్తూనే ఉన్నాం. తాజాగా హైదర్నగర్లో ఉంటున్న కౌశిక్, వంశీ అనే యువకులు మద్యం తాగి అనంతరం సీసాలను పక్క ఇంటిపైన పడేశారు. దీంతో యువకులకు, స్థానికులకు మధ్య స్వల్ప వివాదం జరిగింది. దీంతో వారిని  ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా, వారిని విడిపించడం కోసం వచ్చిన స్నేహితులు పోలీసులతో గొడవపడి పోలీస్‌స్టేషన్‌లో దాడికి తెగపడింది.

ఈ దశలో ఆ యువతిని నిలువరించేందుకు పోలీసులు నానా తిప్పలు పడ్డారు.పోలీస్‌స్టేషన్‌లోని ఫర్నీచర్‌ను కిందపడేసి హంగామా చేశారు. తరుణ్ సాఫ్ట్‌వేర్ రంగంలో వ్యాపారవేత్త కాగా, ప్రియాసింగ్ ఇంటర్ పూర్తి చేసింది.  ఈ సంఘటన మొత్తం వీడియో తీసి గోప్యంగా ఉంచాలని స్థానిక పోలీసులు ప్రయత్నించారు.  కానీ ఆ వీడియో మాత్రం  లీక్ అయిన  పోలీస్ ఉన్నతాధికారులను సైతం ఆశ్చర్యానికి గురి చేసింది. కౌశిక్, తరుణ్, వంశీ, ప్రియలపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు పోలీసులు సమాయత్తమవుతున్నట్లు సమాచారం.


మరింత సమాచారం తెలుసుకోండి: