హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు మరోసారి నెత్తురోడింది. ఆంధ్రప్రదేశ్ ఆప్కాబ్ ఛైర్మన్ పిన్నమనేని వెంకటేశ్వరావు కారు హైదరాబాద్ పహాడీ షరీఫ్ వద్ద ఓటర్ రింగ్ రోడ్డులో ప్రమాదానికి గురైంది. ప్రమాదంలో పిన్నమనేని భార్య సత్యవాణి, కారు డ్రైవర్ దాసు అక్కడికక్కడే మృతి చెందారు. 

మళ్లీ ఔటర్ పై నెత్తురు.. 


పిన్నమనేని వెంకటేశ్వరరావుకు తీవ్ర గాయాలయ్యాయి. ఆయన్ని బంజారాహిల్స్ లోని  అపోలో ఆస్పత్రికి తరలించారు. విజయవాడ నుంచి  హైదరాబాద్ కు వస్తుండగా రాత్రి 2 గంటలు దాటిన తర్వాత ప్రమాదం సంభవించింది.

పిన్నమనేని భార్య,డ్రైవర్ మృతి..


పహాడీషరీప్ వద్దకు రాగానే కారు టైరు పగిలి పోయింది. దీంతో కారు బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే చనిపోగా... పిన్నమనేని శంషాబాద్ లోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఆ తరవాత అపోలోకు తీసుకెళ్లారు. ఇద్దరి మృతదేహాలను ఉస్మానియాకు తరలించారు..


ఈ టైర్ పేలడమే ప్రమాదానికి కారణం..



మరింత సమాచారం తెలుసుకోండి: