పాకిస్థాన్ లో దారుణం చోటు చేసుకుంది..ప్రముఖ గాయకుడు పాపులర్ ఖవాలీ సింగర్ అంజాద్ సాబ్రీ (45) దుండగులు దారుణంగా కాల్చిచంపారు. బుధవారంనాడు ఈ సంఘటన జరిగింది. సాబ్రీ సోదరుల గ్రూపు కవాలీలో చాలా ఫేమస్. అయితే సంగీతమే తన ఊపిరిగా సాగుతున్న అంజాద్ సాబ్రీ ఎవరితోనూ విభేదాలు లేవని ఆయన కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. కరాచీ లోని లియాఖతాబాద్ లో ఆయన తన ముగ్గురు సహచరులతో కలిసి కారులో వెళ్తుండగా..బైక్ పై వచ్చిన కిల్లర్స్అతి దగ్గర నుంచి కాల్పులు జరిపారని పోలీసులు తెలిపారు.
అయితే తీవ్రంగా గాయపడిన సాబ్రీ ని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించినట్టు డాక్టర్లు ప్రకటించారు. ఈ ఘటనలో ఆయన ముగ్గురు సహచరులు కూడా మృతి చెందారు. ముసుగు వేసుకొని వచ్చిన ఆ సాయుధులు ఎవరి అనేది ఇంకా తెలియలేదు.
ఈ ఘటనలో ఆయన ముగ్గురు సహచరులు కూడా మృతి చెందారు. పాక్ లో అంజాద్ సాబ్రీ కుటుంబానికి మంచి ఖవాలీ గాయకులుగా పేరుంది. సాబ్రీ మరణించినట్టు తెలియగానే ఆయన అభిమానులు విషాదంలో మునిగిపోయారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు కొనసాగిస్తున్నారు.