ఆ మద్య ఒంటిపై బంగారు చొక్కా దరించి చేతినిండా ఒంటినిండా బంగారు ఆభరణాలు దరించి సంచలనం రేపిన ఫూణెకు చెందిన దత్తాత్రేయ పుగే అతి దారుణంగా హత్య చేయబడ్డారు. ఒంటికి బంగారు చొక్కా.. మెడలో భారీ బంగారు గొలుసులు దరించి అందరి దృష్టి ఆకర్షించి గోల్డ్ మ్యాన్ గా పేరు తెచ్చుకున్న దత్తాత్రేయ పుగే ఈ రోజు తెల్లవారు జామున గుర్తు తెలియని దుండగులు ఎవరో దారుణంగా హత్య చేయటం సంచలనంగా మారింది. కారులో ప్రయాణిస్తున్న పుగే ని కొంత మంది అపరిచితులు కారు అడ్డుకొని బయటకు గుంచి కొడవళ్లు రాళ్లతో దాడి చేసి దారుణంగా హత్య చేశారు. ఈ గోల్డ్ మ్యాన్ హత్యకు ఆర్థిక లావాదేవీలే కారణంగా చెబుతున్నారు.
వక్రతుండ చిట్ ఫండ్ పేరుతో పలువురి నుంచి డబ్బులు వసూలు చేసి అక్రమాలకు పాల్పడినట్లుగా ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. ఆర్థిక లావాదేవీల్లో వచ్చిన లెక్కల తేడానే ఆయన మరణానికి కారణమన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దాడికి పాల్పడినట్లు అనుమానిస్తున్న వారిలో ఒక వ్యక్తి ఈ తండ్రికొడుకులను పుట్టినరోజు వేడుకలకు ఆహ్వానించాడని పోలీసులు వెల్లడించారు. ఆర్థిక తగాదాలే ఈ హత్యకు కారణంగా అనుమానిస్తున్నారు. ఈ కేసులో నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అందులో ఒక వ్యక్తి దత్తా మేనల్లుడని తెలుస్తోంది. ఈ హత్యపై కేసు నమోదు చేసిన పోలీసులు.. గోల్డ్ మ్యాన్ హత్య వెనుకున్న అసలు కారణం ఏమిటి? అన్న అంశంపై ఆరా తీస్తున్నారు. ఈ ఉదంతంలో దత్తాత్రేయ కుమారుడు తప్పించుకున్నట్లుగా తెలుస్తుంది. దత్తా బంగారు చొక్కా ధరించిన వ్యక్తిగా దేశవ్యాప్త ప్రచారం పొందాడు.