రాష్ట్ర ముఖ్య మంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి జెఏసి చైర్మన్ కోదండరామ్ సవాల్ విసిరారు. తమపై కేసులు పెట్టి అరెస్ట్ చేసి చూడండని, ఎప్పుడు అరెస్ట్ అంటారో చెప్పండి, మీ ఇంటి ముందు వచ్చి నిలబడతామన్నారు. ఆ తర్వాత ఏం జరగాలో అదే జరుగుతుందని హెచ్చరించారు. కేసులతో ఆగం, కేసులకు భయపడం అన్నారు. కేవలం 24 గంటల వ్యవధిలో తెలంగాణా కోసం ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారని, వారి మరణాలకు ముఖ్యమంత్రే బాధ్యత వహించాలన్నారు. ఎంతవారినైనా తిడతాం, ప్రజా జీవితంలో ఉన్నవారికి మినహాయింపులు ఉండవన్నారు. కాంగ్రెస్ ప్రజలకు సమాధానం చెప్పలేక ఎదురుదాడి చేస్తోందన్నారు,ఇచ్చిన హామీ నిలబెట్టుకోనందుకే ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోందన్నారు. చట్టం తన పని తను చేసుకునిపోతే, తెలంగాణా ఉద్యమం కూడా తన పని తను చేసుకుపోతుందని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: