ఈ మద్య హైదరాబాద్ లో కొన్ని సంఘటనలు చూస్తుంటే నేరాలు బాగా విస్తరిస్తున్నాయని తెలుస్తుంది. ఓ వైపు లా అండ్ ఆర్డర్ చాలా బాగుందని నేరాలు బాగా తగ్గిపోయాయని పోలీసు అధికారులు అంటుంటే..ప్రతి రోజు ఎక్కడో అక్కడ నేరాలు ఘోరంగా జరుగుతూనే ఉన్నాయి. వారం రోజుల క్రితం నగరంలో సంచలనం రేపిన వివాహిత సుశృత ను ఆమె భర్త విచక్షణారహితంగా ప్రవర్తించడంతో మనస్థాపం చేందిన ఆమె ఉరివేసుకుంది.  హైదరాబాద్ నగరంలోని సైదాబాద్ పూసలబస్తీకి చెందిన సుశృతను వాటర్ హీటర్ ఎక్కువసేపు వాడిందనే నెపంతో తీవ్రంగా కొట్టాడు. అంతే కాదు   బాత్రూంలో ఉన్న ఆమెను అలాగే ఈడ్చుకొచ్చి వివస్త్రను చేసి తీవ్ర కొట్టాడు.  

ఎంత వేడుకున్నా కనికరం చూపకుండా కుటుంబసభ్యుల ముందే దాడి చేశాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆమె ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సుశృత ఆత్మహత్య చేసుకునే ముందు  వాట్సప్‌లో తన తండ్రికి మెసేజ్ పెట్టింది. దీంతో ఆమె కుటుంబసభ్యులు ఆందోళన చేపట్టారు. తమ కూతురు మరణానికి కారణమైన భర్త, అత్తామామలు, వారి కుటుంబసభ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ధర్నా చేశారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు భర్తతో పాటు మామ శంకర్‌రావును అరెస్ట్ చేసి చంచల్‌గూడ జైలుకు తరలించారు. జైల్లో ఉన్న శంకర్‌రావు(65)కు ఆదివారం ఉదయం గుండెపోటు రావడంతో అధికారులు చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అతడిని పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్టు నిర్ధారించారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, బంధువులు ఆస్పత్రికి వచ్చి ఆందోళన చేపట్టారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: