వైఎస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు జగన్మోహన్ రెడ్డి బావ బ్రదర్ అనిల్ కుమార్కు కేటాయించిన భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని లేనిపక్షంలో ఆ స్థలంలో జెండాలు పాతి పేదలకు పంచుతామని, తాము అలా చేయకుండా ఉండాలంటే ప్రభుత్వమే ఆ భూములను స్వాధీనం చేసుకోవాలని నారాయణ స్పష్టం చేశారు. దీంలోభాగంగానే బ్రదర్ అనిల్ రెండ్రోజుల క్రితం హైదరాబాద్ శివారు ప్రాంతమైన మణికొండలోనూ భూకబ్జాకు పాల్పడినట్టు ఆరోపణలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే.   చిత్తూరు జిల్లా జరిగిన కార్యవర్గ సమావేశంలో సీపీఎం నుంచి భారీస్థాయిలో కార్యకర్తలు సీపీఐలో చేరారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ పంచాయితీ ఎన్నికలను నిర్వహించమన్న సుప్రీం కోర్టు తీర్పును స్వాగతిస్తున్నట్లు నారాయణ తెలిపారు. మళ్ళీ ఎలాంటి మడత పేచీలు లేకుండా ఎన్నికలు నిర్వహించాలని ఆయన ప్రభుత్వానికి సూచించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: