గత రెండేళ్ల కాలంలో ఏపీ రాష్ట్రంలో వాడివేడి చర్చ జరిగిన విషయమేమిటని చెబితే నిరుద్యోగ భృతి అనే చెప్పాలి. అయితే ఇప్పుడు ఈ విషయం పై ఏపీ అధికార పార్టీ నేత, కార్మిఖ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు కుండ బద్దలు కొట్టేశారు. ఆయన వెలగపూడి లోని తాత్కాలిక సచివాలయంలో మంత్రి తన పేషీని ప్రారంభించే క్రమంలో నిరుద్యో గులకు ఇవ్వాలని భావించిన భృతిని దాదాపుగా అటకెక్కించారు.