కాంగ్రెస్ మహావృక్షం అందరూ మా కిందకు రావలసిందే అని కాంగ్రెస్ నాయకులు ఎందుకు అంటారో ఇప్పుడు కొందరికి అర్థం అవుతున్నట్లుంది. కాంగ్రెస్ తో తమ కుటుంబానికి దశాబ్దాల అనుబంధం ఉంది కానీ నన్ను పట్టించుకోలేదు , మంత్రి పదవి ఇవ్వలేదన్న కావూరి సాంబశివ రావు గారు పార్లమెంట్ కు హాజరయ్యారు.  ఎట్టకేలకు ఏలూరు ఎంపీ కావూరి సాంబశివరావు తన రాజీనామాను ఉపసంహరించుకున్నారు, గురువారం ఉదయం పార్లమెంటు బడ్జెట్ సమావేశాలకు కావూరి హాజరయ్యారని సమాచారం. జగన్ పార్టీ పరిస్థితి కూడా ఏమంత ఆశాజనకంగా లేదని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి కావూరి గారిని ఇలా చూడడం అందరికి సంతోషాన్ని కలిగించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: