జైలు నుండి బెయిలుఫై విడుదలయిన ఆనందం కన్నా మరిన్ని కేసుల భయం ఇప్పుడు అక్బరుద్దీన్ ఒవైసి కి చుట్టుకుంది. తాజాగా ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌కు బెంగళూరు కోర్టు సమన్లు జారీ చేసింది. వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ఈనెల 23న వ్యక్తిగతంగా తమ ఎదుట హాజరు కావాలని న్యాయస్థానం ఈ సందర్భంగా ఆదేశించింది.  అక్బర్ చేసిన వ్యాఖ్యలపై ధరంపాల్‌,దిలీప్‌కుమార్, అనే న్యాయవాదులు ఇటీవల బెంగళూరు అదనపు ఛీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. పిటిషన్ పై విచారణ జరిపిన న్యాయవాది అక్బరుద్దీన్‌కు ఈ నోటీసులు జారీ చేశారు.కోర్టు సమన్లను బంజారాహిల్స్ పోలీసులు గురువారం అక్బరుద్దీన్ కు అందచేశారు. నడుస్తున్న పరిస్థితులు చూస్తుంటే ఇంత త్వరలో అక్బర్ కు ఊరట లభించడం కష్టంగా అనిపిస్తుంది. దీనికి కాంగ్రెస్ పార్టీ తో తెగతెంపులకు ఏమైనా సంబంధం ఉందా అని ఒక చర్చ రాజకీయ విశ్లేషకుల్లో జరుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: