బాంబు పేలుడు ఘటనలో ప్రధాన ముద్దాయి కేంద్ర ప్రభుత్వమేనని బిజెపి జాతీయ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ అన్నారు. తీవ్రవాదాన్ని ఓ సవాల్ గా స్వీకరించడానికి కేంద్రం సిద్ధంగా లేదన్నారు. ఈరోజు ఆయన బాంబు పేలిన ప్రాంతాలను పరిశీలించారు. ఆస్పత్రులలో క్షతగాత్రులను పరామర్శించారు. నిఘా విభాగం వైఫల్యం స్సష్టంగా కనిపిస్తుందన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఉగ్రవాదకార్యకలాపాలకు హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా తయారైందన్నారు. జంట పేలుళ్లు ప్రభుత్వ వైఫల్యమేనని ఆయన పేర్కొన్నారు. ఆస్పత్రులలో చికిత్స పొందుతున్నవారి పరిస్థితి దయనీయంగా ఉందని చెప్పారు. పేలుళ్లలో మృతి చెందినవారికి సంతాపం ప్రకటించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: