ప్రత్యక్ష రాజకీయాల్లో నారా లోకేష్ హవా క్రమంగా విస్తరిస్తోంది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సొంత నియోజవర్గం కుప్పం బాధ్యతలు ఇక నుంచి కుమారుడు లోకేష్ చేతుల్లోకి వెళ్లనుండడమే ఇందుకు నిదర్శనం. మొన్న జరిగిన డీసీసీబీ, డీసీఎంఎస్ ఎన్నికల్లో ఇక్కడి నాయకులు అధినేత ఆదేశాలు పెడచెవిన పెట్టి, కాంగ్రెస్ తో చాటుమాటు రాజకీయాలు నెరిపారు. ప్రతిఫలంగా కుప్పం ఛైర్మన్, వైస్ ఛైర్మన్ పదవులు పొందారు. దీంతో ఆగ్రహంతో ఉన్న బాబు కుప్పం స్థానిక ఎన్నికల బాధ్యతను కొడుకుకే అప్పగిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని బలపరుస్తూ శుక్రవారం లోకేష్ చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలోని గుడుపల్లె మండలంలో ఓ కార్యకర్త ఇంట్లో జరిగిన పెళ్లికి హాజరయ్యారు. కానీ, పార్టీ నేతలెవరితోనూ ఆయన మాట్లాడలేదు. మార్చి 7,8,9 తేదీల్లో కుప్పంలో పర్యటిస్తానని వారికి చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: