తెలంగాణా కోసం మరో పార్టీ రానుంది.ప్రత్యేక రాష్ట్ర సాధనే లక్ష్యంగా మరో రాజకీయ పార్టీ ఆవిర్భవించనున్నది. వరంగల్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ ఎర్రబెల్లి ప్రదీప్‌రావు (ఎర్రబెల్లి దయాకర్ రావు సోదరుడు ) తెలంగాణ నిర్మాణ సమితి (టీఎన్ ఎస్) పేరుతో ఈ కొత్త పార్టీని ఏర్పాటు చేస్తున్నారు.  శుక్రవారం వరంగల్‌లో విలేకరులకు ఆయన ఈ విషయం వెల్లడించారు. 24న సాయంత్రం స్వర్ణప్యాలెస్‌లో పార్టీ ఆవిర్భావ సభను నిర్వహిస్తున్నట్టు తెలిపారు. తెలంగాణవాదులు, ఉద్యమనేతలు, సంస్థలు, అన్ని టీజేఏసీల ప్రతినిధులు ఈ సభకు హాజరు కావలసిందిగా ఆయన విజ్ఞప్తి చేశారు. మరోవైపు ఈ పార్టీ వెనుక చంద్రబాబు ఉన్నారంటూ గుసగుసలు వినిపిస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: