దిల్‌సుఖ్‌నగర్‌లో జరిగిన వరుస బాంబు పేలుళ్ల ఘటనపై అంతర్ రాష్ట్ర పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. ముఖ్యంగా ఈ దారుణానికి దేశంలో వివిధ ప్రాంతాలకు సంబంధం ఉండడం, వేరే పేలుళ్ళకు సారూప్యత, మరిన్ని దాడులు జరగవచ్చన్న సందేహం, ఇలా వివిధ కారణాలతో వేరే రాష్ట్రాలనుండి పోలీసులు ఇక్కడకు వస్తున్నారు. మహారాష్ట్ర తరువాత తాజాగా శనివారం మధ్యాహ్నం గుజరాత్, కర్నాటక రాష్ట్రాలకు చెందిన ఏటీఎస్ పోలీసులు బాంబు పేలుళ్ల ఘటనా స్థలికి చేరుకుని తనిఖీలు చేపట్టారు. అలాగే జరిగిన ఘటనపై వివరాలు సేకరిస్తున్నారు. దిల్‌సుఖ్‌నగర్ బాంబు పేలుళ్ల ఘటన నేపథ్యంలో పోలీసులు అబ్దుల్‌ను అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.గతంలో ఈయన అక్రమంగా ఆయుధాలు సరఫరా చేసిన నేరారోపణలు ఉన్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: