కాంగ్రెస్ పార్టీపై కొడవళ్లు, కత్తులతో దాడులు చేయాలని గుంటూరు జిల్లాలో చంద్రబాబు వ్యాఖ్యానించిన నేపథ్యంలో కాంగ్రెస్ నాయకులు , మంత్రులు బాబుఫై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడుపై ఇవాళ్ళ మంత్రి కొండ్రు మురళి మండిపడ్డారు.  కాంగ్రెస్ పార్టీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆయనపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని అన్నారు. ప్రజలను రెచ్చగొట్టే విధంగా చంద్రబాబు మాట్లాడుతున్నారని కొండ్రు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి కూడా చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. బాబుకు మతి స్థిమితం లేదని, తక్షణమే తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోకపోతే ప్రజలే తిరగబడతారని హెచ్చరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: