పెద్ద నోట్ల రద్దు కారణంగా పక్షం రోజులుగా కోట్లాది మంది సామాన్య, మధ్యతరగతి ప్రజలు నానా తంటాలు పడుతూ... ఎప్పటికీ తిప్పలు తప్పుతాయో తెలియని అయోమయంలో కొట్టుమిట్టాడుతుంటే, ప్రధాని నరేంద్రమోడీ తన చర్యపై ‘ప్రజాభిప్రాయ సేకరణకు’ విడుదల చేసిన యాప్ ద్వారా 93 శాతం ప్రజల ఆమోదం పొందటం ఆశ్చర్యకరమే. మంగళ వారం ఉదయం 10 గంటల నుంచి బుధవారం మధ్యా హ్నం 3.30 గంటల వరకు ప్రధాని యాప్కు, స్పందించి నవారు 5 లక్షల మంది.