నల్ల కుబేరులకు కేంద్రం చివరి అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. బ్లాక్మనీని స్వచ్ఛందంగా వెల్లడించే పథకం సెప్టెంబర్ నెలతో ముగిసింది. అయితే కొందరు మాత్రమే దీనిని వినియోగించుకున్నారు. కేవలం 64,275 మంది మాత్రమే ఆదాయానికి మించి ఉన్న నగదు, ఆస్తుల గురించి వెల్లడించారు. రూ.65,250 కోట్ల నల్ల ధనాన్ని ప్రకటించి ఆ మేరకు ట్యాక్స్ కట్టేందుకు ముందుకు వచ్చారు. దీంతో సుమారు రూ.30,000 కోట్ల పన్నులు వసూలయ్యాయి. అయితే 133 కోట్ల భారత జనాభాలో నల్ల కుబేరుల సంఖ్య లక్షల్లో ఉండే అవకాశముంది. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ కఠి