నోట్ల రద్దుకు నిరసనగా విపక్షాలు సోమవారం చేపడుతున్న భారత్ బంద్ తెలుగు రాష్ట్రాల్లో నామమాత్రంగా సాగుతోంది. భారత్ బంద్లో పలు కార్మిక సంఘాలు భాగస్వామ్యం కాకపోవడంతో ప్రభావం అంతంగా కనిపించడం లేదు. తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో వైయస్సార్ కాంగ్రెస్ , సీపీఎం,సీపీఐ ,పార్టీలు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేపట్టాయి.