చంద్రబాబు ప్రభుత్వం మరో రెండేళ్లు మాత్రమే అధికారంలో ఉంటుందని, దేవుడు గట్టిగా దయతలిస్తే వచ్చేఏడాదే ఎన్నికలు రావచ్చని వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి వ్యాఖ్యానించారు. ఎన్నికలు వస్తే ఇక తామే విజయం సాధిస్తామని చెప్పారు. కృష్ణా జిల్లా బుద్ధాలపాలెంలో జగన్ రైతులతో ముఖాముఖి నిర్వహించారు. అక్కడ ప్రజల కష్టాలను అడిగి తెలుసుకున్నారు. చంద్రబాబు చేస్తోన్న అన్యాయాల పట్ల రైతులు అసహనంతో ఉన్నారని చెప్పారు. చంద్రబాబు పాలన ఎన్నో ఏళ్లు ఉండదని చెప్పారు. ఆ తరువాత వచ్చేది మ