గడప గడపకు వైఎస్ఆర్ కార్యక్రమం నిర్వహించాడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లాన్ రెడీ చేస్తోంది. ఈ మేరకు ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో సమీక్షా సమావేశాలు జరుగుతున్నాయి. వైసీపీ కేంద్ర కార్యాలయంలో జరుగుతున్న ఈ సమావేశాల్లో ఉదయం శ్రీకాకుళం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, విజయనగరం, కృష్ణా జిల్లాల నేతలతో భేటీ అయిన వైఎస్ జగన్.. అనంతరం విశాఖ జిల్లా నేతలతో సమావేశం అయ్యారు. రెండు రోజుల పాటు జరగనున్న ఈ సమావేశాల్లో మంగళవారం కర్నూలు, అనంతపురం, వైఎస్ఆర్ జిల్లాల నేతలతో వైఎస్ జగ