తమిళనాట రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. నిన్నా మొన్నటి వరకు తిరుగులేని నాయకురాలిగా వెలుగొందిన జయలలిత అస్తమించడం నిజంగా దురదృష్టకరం. అయితే ఆస్థానాన్ని ఎవరూ పూడ్చలేరు. ఆ స్థాయి నేతలు తమిళనాడు నుంచి వస్తారని కూడా ఊహించడం కష్టం. భారత రాజకీయాల్లో ఇందిర గాంధీ తర్వాత ఉక్కుమనిషిగా పేరుతెచ్చుకున్న నాయకురాలు జయ. ఎన్నికష్టాలు ఎదురైనా శత్రువు ముందు తలవంచని ధీశాలి. ఎన్ని అపజయాలు ఎదురైనా అలుపెరుగని పోరు చేసిన ధైర్యవంతురాలు జయ అలాంటి నాయకురాలు లేరన్న వార్తను తమిళ ప్రజలు జీర్ణించుకోలేక పోతున్నారు.