బాహుబలి సృష్టికర్త ఎస్ఎస్ రాజమౌళికి ఏపీ ప్రభుత్వం నుంచి పిలుపు అందింది. ఏపీ రాజధాని అమరావతిని అద్భుత నగరంగా తీర్చిదిద్దేందుకు రాజమౌళి సలహాలు, సూచనలు తీసుకోవాలని ఏపీ సీఎం చంద్రబాబు భావిస్తున్నారు. దీనిలో భాగంగా పురపాలక శాఖ మంత్రి నారాయణ, రాజధాని ప్రాంత కమిషనర్ చెరుకూరి శ్రీధర్, ఇతర అధికారుల బృందం రాజమౌళితో గంటకు పైగా సమావేశమయ్యారు. ఈ సమావేశంలో తెలుగు రాష్ట్రాల్లోని విభిన్న ప్రాంతాలను పాలించిన రాజులు, అక్కడి భవనాలు, అక్కడి చరిత్రపై చర్చించినట్లు తెలిసింది. కాగా, ప్రభుత్వ అభ్యర్థనను గౌరవ