చెన్నయ్ తీరాన్ని తాకిన వార్దా అతితీవ్ర తుఫాను ప్రభావంతో చెన్నయ్ నగరం వణికిపోతోంది. స్థానిక ప్రజలను చెన్నయ్లోని 30 పునరావాస కేంద్రాలకు తరలించారు అధికారులు. బలమైన ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురుస్తుండడంతో ఇప్పటికే వందలాది చెట్లు, స్తంభాలు నేలకొరిగాయి. ఎవరూ బయటకు రాకూడదని ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను హెచ్చరిస్తోంది.