సోమవారం జరిగిన అసెంబ్లీ శీతాకాలం సమావేశాల్లో సీఎం కేసీఆర్ ఆశక్తికర వ్యాఖ్యలు చేశారు. ఉద్యమకాలంలో నయీం కు వార్నింగ్ ఇచ్చానని తన ప్రసంగంలో భాగంగా సీఎం కేసీఆర్ కొన్ని పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకు న్నారు. టీఆర్ఎస్ నేత సాంబశివుడి హత్య జరిగిన తర్వాత ఆయన కుటుంబాన్ని పరామర్శించేందుకు తాను వెళ్లానని, అప్పుడు అక్కడ జరిగిన సంస్మరణ సభలోనే నయీం దురాగతాల్ని ప్రశ్నించానని గుర్తు చేశారు.