తెలంగాణ శీతకాలపు సమావేశాలలో రచ్చ వాడి వేడిగా సాగుతుంది. మేమంటే మేమే అంటూ ఒకరిపైఒకరు విమ ర్శాస్త్రాలు సందించుకున్నారు. తెలంగాణ రాష్ట్రం లో ఏర్పాటైన తరువాత ఈ స్థాయిలో విమర్శలు చేసుకోవ డం ఇదే ప్రదమం. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఘనత తమదంటే తమదంటూ అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్ మంగళవారం శాసనసభలో మాటల యుద్ధానికి దిగాయి. అటు మంత్రి కేటీఆర్.. ఇటు సీఎల్పీ నేత జానారెడ్డి, టీపీసీసీ చీఫ్ ఉత్తమ్కుమారెడ్డిల మధ్య మాటల తూటాలు పేలాయి.