ఇవాళ ఒకే ఫైనాన్స్ కంపెనీలో రెండు చోట్ల చోరీలు జరిగాయి. ముత్తూట్ ఫైనాన్స్ కంపెనీలో గుజరాత్ లో చోరీ జరగగా.. ఇటు తెలంగాణలోనూ అదే ఫైనాన్స్ కంపెనీలో దొంగలు పడడం గమనార్హం. సంగారెడ్డి జిల్లా బీరంగూడలో భారీ దోపిడీ జరిగింది. ఈ ఉదయం ముత్తూట్ ఫైనాన్స్ సంస్థలోకి చొరబడిన ఐదుగురు దుండగులు 10 కోట్ల రూపాయల విలువ చేసే బంగారం దోచుకెళ్లారు.