ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఢిల్లీలో సమావేశమైన కేంద్ర కేబినెట్ పలు కీలక అంశాలపై చర్చించింది. ఈ సందర్భంగా పెద్దనోట్ల రద్దు వ్యవహారంపై ప్రధాంగా చర్చించారు మంత్రులు. బ్యాంకుల్లో పెద్దనోట్లను మార్చుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన గడువు మరో రెండు రోజుల్లో ముగుస్తున్న నేపథ్యంలో తదుపరి తీసుకోవాల్సిన చర్యలు, కార్యాచరణపై మంత్రులు ముచ్చటించారు.