సంక్రాంతి పండగను పురస్కరించుకుని ప్రతిఏటా ఆనవాయితీగా వస్తునన కోడి పందాలు ఈసారి ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టిందని చెప్పాలి. ప్రత్యేకంగా కోస్తా జిల్లాల్లో కోడి పందేల కార్యక్రమం అధికార పార్టీ నేతలు - అధి కారులకు భయం పుట్టిస్తున్నాయి. సంప్రదాయాల పేరుతో పందేలకు సిద్ధమవుతున్న ప్రజలు... తీవ్ర హెచ్చరి కలు చేస్తున్న కోర్టు మధ్య నలిగిపోతున్నామని వారు అంటున్నారు.