తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారాచంద్రబాబు తనయుడు లోకేష్ నేటినుంచి 10వ తేదీ వరకు చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. త్వరలో స్థానికి సంస్థల ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నందున జిల్లాలో పార్టీని బలోపేతం చేసే దిశగా లోకేష్ పర్యటన ఉంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. చంద్రబాబు పాదయాత్రలో ఉన్నందున కుప్పం నియోజకవర్గ సమస్యలను దగ్గరుండి పరిష్కరిస్తూ పార్టీ పరిస్థితిని ఆయన సమీక్షించనున్నారు. లోకేష్ తరచూ చిత్తూరు జిల్లాలో పర్యటించడం సాధారణమే అయినా ఈసారి నాలుగురోజుల పర్యటనలో ప్రత్యేకించి రాజకీయ కార్యక్రమాల్లో ఎక్కువ పాల్గొనేలా ప్రణాళిక సిద్దం చేసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: